Wednesday, August 24, 2016

ముఝ్‌సే పహలీ- సీ ముహబ్బత్‌ - Mujhse pehli si mohabbath - Khaidi old movie - Noorjahan - Faiz ahmed faiz writer


లోకంలో ప్రేమే కాదు... కోట్లాది దుఃఖాలున్నాయి.


మనిషి జీవితంలో ఎన్నెన్ని దశలు? ఒక నాడు నీటిబుడగలతో అడుకున్న వాడే కొన్నాళ్లుపోయాక నక్షత్రాలతో ఆడుకుంటాడు. ఒక నాడు తరంగమై కదిలిన వాడు కొన్నాళ్లు పోయాక సముద్రమై ఎగిసిపడతాడు. తాను సుఖంగా ఉంటే చాలనుకున్న వాడు ఒక నాడు సర్వ సుఖాలతో ఉండికూడా సాటి మనుషుల దుఃఖాలు చూసి వెక్కివెక్కి ఏడుస్తాడు. ప్రాణానికి ప్రాణమైన ప్రేమమూర్తి ఎదురుగానే ఉన్నా ఏమీ పట్టనట్లు, మంటల్లో కాలిపోతున్న మనుషుల కోసం పరుగెడతాడు. తనతో పాటు మరికొందరిని కలుపుకుని ఆ మంటల్ని చల్లార్చే పనిలో పడతాడు. లోకమే జీవితమై పోయినవాడికి, తన వ్యక్తిగత జీవితం జీవితంలానే అనిపించదు. ఈ ఇతివృత్తమే ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ రాసిన ఈ గీతంలో ధ్వనిస్తుంది. ‘ కైదీ’ సినిమాలోని ఈ పాటను రశీద్‌ ఆతే్త్ర స్వరబద్ధం చేస్తే మహాగాయని నూర్జహాన్‌ మహార్థ్రంగా గానం చేశారు. 
* * * * *
ముఝ్‌సే పహలీ- సీ ముహబ్బత్‌, మేరే మహబూబ్‌ న మాంగ్‌ /ముఝ్‌సే/ 
మైనే సమ్‌ఝా థా కె, తూ హై తో దరఖ్‌షాఁ హై హయాత్‌ 
తేరా గమ్‌ హై తో గమ్‌-ఎ-దహర్‌ కా ఝగ్‌డా క్యా హై 
(ఒకప్పుటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నా నుంచి ఆశించకు 
నీవుంటే బతుకుంతా కాంతులీనుతుందనే అనిపించింది నాకు... కానీ, 
నీ బాధల్లో ఇక్కడ నేనుండిపోతే... ప్రపంచ బాధల పైన ప్రతిఘటన ఎక్కడ?) 
తాను ప్రేమించిన వ్యక్తే తన లోకంగా అనుకుంటున్నంత కాలం,, అసలు సిసలైన లోకమొకటి అవతల ఉందన్న సంగతే గుర్తుకు రాదు. తనకు, తన ప్రేమమూర్తికి ఆవల ఏం జరిగినా తనకు సంబంధమే లేదనిపిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి తనతో ఉంటే జీవితం కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతుందనిపిస్తుంది. తన ప్రేమమూర్తే తన నేలగా ఆకాశంగా అనిపిస్తుంది. కానీ, తరంగానికేసి చూస్తూ అదే సముద్రమని ఎంతకాలం మనల్ని మనం మభ్యపెట్టుకోగలం? లోకంలో జరుగుతున్న అనేకానేక మానవ పోరాటాల్లో ఏ ఒక్కదానితోనూ సంబంధం లేకుండా ఎన్నాళ్లని ముడుచుకు పడిఉంటాం? అలా ఉండిపోదామనే అనుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక చోట ఎవరి ఆర్తనాదమో మన చెవుల్లో గింగురుమంటుంది?. ఎవరి అశ్రుధారో అగ్నిధారలా మన గుండెల్ని కాల్చివేస్తుంది. అంతటితో అన్నేళ్లూ మనల్ని కట్టిపడేసిన సంకెళ్లన్నీ పటాలున తెగిపోతాయి. హఠాత్తుగా మనం మానవ సముద్రంలో కలసిపోతాం. అప్పటిదాకా దోసిట్లో పెట్టుకున్న తరంగాన్ని సముద్రంలోకి వదిలేసి మనమూ ఆ సముద్రంలోకి దూకేస్తాం. సముద్రమంతా వ్యాపిస్తాం. నువ్వు నాకోసం, నేను నీ కోసం అనే ధోరణిపోయి మనమున్నది లోకం కోసం.... కోటానుకోట్ల జనావళిని శోక విముక్తి చేయడానికి సాగుతున్న పోరాటాల్లో మనమూ భాగమవుతాం. ఆ స్థితిలో మనల్ని కట్టిపడవేసే బంధాలకు వీడ్కోలు చెబుతాం.
తే రీ సూరత్‌ సే హై ఆలమ్‌ మేఁ బహారోఁ కో సబాత్‌ 

తేరీ ఆంఖో కే సివా దునియా మేఁ రఖా క్యా హై -2 
తూ జో మిల్‌ జాయే తో తక్‌దీర్‌ నిగూఁ హో జాయే 
యూఁ న థా మైఁ నే ఫకత్‌ చాహా థా యూఁ హో జాయే 
ఔర్‌ భీ దుఖ్‌ హైఁ జమానే మే ముహబ్బత్‌ కే సివా రాహ్‌తేఁ ఔర్‌ భీ హైఁ వసల్‌ కే రాహత్‌ కే సివా 
హాఁ.... ముఝ్‌ సే పహలీ- సీ ముహబ్బత్‌, మేరే మహబూబ్‌ న మాంగ్‌ / ముఝ్‌సే /
(నీ మోవితోనే లోకంలో వసంతం వెల్లివిరుస్తోంది 
నీ కళ్లు కాక లోకంలో ఇంకేముంది? నువ్వే లభిస్తే అదృష్టమే వచ్చి నా పాదాక్రాంతమవుతుంది 
అలా అని కఛ్చితంగా ఇలాగే జరగాలని కూడా నేనేమీ అనుకోలేదు 
ఎందుకంటే పపంచంలో ప్రేమ ఒక్కటే కాదు, ఎన్నో దుఃఖాలున్నాయి 
ప్రేమికుల కలయికే కాదు ఇంకా సంతోషాలెన్నో ఉన్నాయి 
అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా నువ్వింక నా నుంచి ఆశించకు) 
లోకపు అన్ని వైపుల్నించీ ఈటెలే దిగుతున్న సమయంలో ఎవరికైనా తన ప్రేమమూర్తిని మించిన వారెవరుంటారు? అందుకే జీవచైతన్యాన్ని ప్రదీపింప చేసే ఆ మూర్తిమత్వం ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది. ఆ ముఖబింబం వెదజల్లే ఆ దివ్యకాంతుల్లో ఓలలాడాలనిపిస్తుంది. కోటి చంద్రబింబాలను ప్రతిబింబింప చేసే ఆ కళ్లను, జీవితాంతపు భరోసానిచ్చే ఆ కళ్ల కాంతి కిరణాలను మించి ఎవరికైనా ఈ లోకంలో ఇంకేముంటుంది? అందునా ఆ ప్రేమమూర్తి పరిచయాలకే పరిమితం కాకుండా, ఏకంగా జీవిత భాగస్వామిగా నిలబడితే ఇంకేముంది? అదృష్టదేవతే వచ్చి తన లోగిలిలో నిలిచినట్లనిపిస్తుంది. అయితే, లోకంలో హోరెత్తే కోటానుకోట్ల శోశధ్వనులు ఒకసారి గుండెల్ని తాకాక అప్పటిదాకా మనం మునిగి తేలుతున్నన ప్రేమలోకం మపకబారిపోతుంది. అంతా మాయలా అనిపిస్తుంది. అంతటితో ఆ హృదయం, తన వ్యక్తిగత ప్రేమనుంచి తన ఆత్మాశ్రయ జీవితం నుంచి బయటికొచ్చి జనంలో కలిసిపోతుంది. జనమే మనమని కోటి ఝంకారాలతో జనజీవన గాధల్ని ఎలుగెత్తి చాటుతుంది. విషాదాల్ని, ప్రమోదాలుగా మార్చే తన వంతు ప్రయత్నం చేస్తుంది.
అన్‌గినత్‌ సదియోఁ కే తారీక్‌ బహీమాన తలిస్మ్‌ 
రేషమ్‌- వో -అట్లస్‌-వో- కంఖ్వాబ్‌ మేఁ బున్వాయే హుయే 
జాబజా బిక్తే హువే కూచా-వో-బాజార్‌ మేఁ జిస్మ్‌ 
ఖాక్‌ మేఁ లిథ్‌డే హువే, ఖూన్‌ మేఁ నహ్లాయే హువే 
జిస్మ్‌ నిక్‌లే హువే అమరాజ్‌ కే తన్నూరోఁ సే 
పీప్‌ బహతీ హుయీ గ ల్తే హువే నాసూరోఁ సే 
లౌట్‌ జాతీ హై ఉధర్‌ కోభి నజర్‌, క్యా కీజే 
అజ్‌ భీ దిల్‌కష్‌ హై తేరా హుస్న్‌ మగర్‌ క్యా కీజే -2 
ఔర్‌ భీ దుఖ్‌ హైఁ జమానే మే ముహబ్బత్‌ కే సివా 
రాహతేఁ ఔర్‌ భీ హైఁ, వస్ల్‌ కీ రాహత్‌ కే సివా 
ముఝ్‌ సే పహలీ- సీ ముహబ్బత్‌ మేరే మహబూబ్‌ న మాంగ్‌ / ముఝ్‌సే/ 
(ఎన్నో యుగాలుగా విస్తరిస్తున్న చీకటి కాలం 
సిల్కు, శాటీన్‌, బంగారు దారాలతో అల్లుకుంటోంది 
వీధివీధినా దేహాలు అమ్ముడుబోతున్నాయి 
దుమ్ము కమ్ముకుని రక్తమోడుతున్న దేహాల 
మానని గాయాలు రసిగారుతున్నాయి. 
నా దృష్టి అటే పోతోంది. మరి .. నే నేం చేయాలి? 
నీ సౌందర్యం ఇప్పటికీ మనోహరమే గానీ, నేనేం ఏంచేయాలి? 
ప్రపంచంలో ప్రేమే కాదు ఇంకా దుఃఖాలున్నాయి. 
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి 

అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నానుంచి ఆశించకు)
‘‘మనిషి తన జీవితంలో ఏది కోల్పోయినా ఫరవాలేదు కానీ తనను తాను కోల్పోకూడదు’’ అంటూ ఉంటారు. తనను తాను కోల్పోవడం అటే తన జీవితం నుంచి తాను వైదొలగిపోవడమే కదా!. దేహాలు అమ్ముడు పోవడం అంటే నీ శ్రమ ఫలితం నీకు దక్కకపోవడం. నీకు నువ్వు కాకుండాపోవడం. అలా నిన్ను నిన్ను కాకుండా చేసే శక్తులు అనాదిగా ఈ లోకంలో తిరుగాడుతున్నాయి. ఏదో నిన్నూ నన్నూ మాత్రమే అని కాదు కోటానుకోట్ల మందిని అవి నిర్జీవం చేస్తున్నాయి. కాకపోతే అవి ఎంతో తెలివిగా ఇతరులెవరూ తమ అసలు రూపాన్ని గుర్తించకుండా బంగారు దారాలతో, పీతాంబరాలతో తమను తాము చుట్టేసుకుంటున్నాయి. ఆ ముసుగులో ఉంటూ జీవితాల మీద దాడులు చేస్తున్నాయి. హృదయాల్నీ తీవ్రంగా గాయం చేస్తున్నాయి. ఆ దాడుల పాల్పడిన దేహాలు నేలమీద పడి దొర్లుతున్నాయి. గాయపడిన హృదయాలు రక్తలోడుతున్నాయి. లోకంలో ఇన్ని ఘోరాలు జరిగిపోతుంటే హృదయం ఉన్న ఏ మనిషైనా తన ప్రేమలోకంలో ఎలా ఉండిపోతారు? తాను ప్రేమించిన వ్యక్తి ఎంతటి సౌందర్యమూర్తి అయినా తన దృష్టి ఆ వైపు పోనే పోదు. మనసున్న ఏ మనిషైనా సాటి మనిషుల బాధల్ని చూస్తాడు. సామాజిక రుగ్మతల మూలాల్ని వెతుకుతాడు. వాటినుంచి విముక్తి కలిగించే తన వంతు ప్రయత్నం చేస్తాడు. లలాంటి వారినే లోకం మనిషి అంటుంది. మనీషి అంటుంది. ఇంకా ఇంకా విస్తరిస్తే రాజర్షి అంటుంది... మహర్షి అంటుంది.. 

 ... బమ్మెర

Friday, August 12, 2016

జబ్‌ జీరో దియా మేరే భారత్‌ నే - jab zeero diya mere Bharth ne - Mahendra kapoor song Poorab our paschim old movie

దేశాల్ని కాదు,
హృదయాల్ని గెలుస్తాం...!


విజ్ఞాన, గ ణిత, సాంకేతిక రంగాల్లో విదేశాలదే పై చేయని చాలా మంది అనుకుంటారు గానీ, గణాంకాలకు మూలమైన సున్నాను, దశాంశాన్ని కనిపెట్టింది భారతీయుడైన ఆర్యభట్ట కదా మరి ! అలా విజ్ఞాన రంగాల్లోనే కాదు సంస్కృతి, మానవ సంబంధ వికాసంలోనూ అనాదిగా, భారతదేశమే శిఖర స్థానంలో ఉంటూ వస్తోంది. అమెరికా వెళ్లిన భారతీయ యువకుడు భారతీయ జీవన విశిష్టతలను, ఇక్కడి మానవ విలువల ఉత్కృష్టతను ఈ పాట ద్వారా అక్కడి వాళ్లకు వివరిస్తాడు. ‘పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’ సినిమా కోసం ఇందీవర్‌ రాసిన ఈ గీతానికి కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీతం సమకూరిస్తే, భారతీయుల గుండెలు సగర్వంతో పులకించిపోయేలా మహేంద్రకపూర్‌ పాడాడు.
* * * * * 
జబ్‌ జీరో దియా మేరే భారత్‌ నే, దునియా కో తబ్‌ గిన్‌తీ ఆయీ 
జీరో కీ భాషా భారత్‌ నే, దునియా కో పహెలే సిఖ్‌లాయీ 
దేతా న దశ్‌మలవ్‌ భారత్‌ తో యూఁ చాంద్‌ పే జానా ముష్కిల్‌ థా 
ధర్‌తీ ఔర్‌ చాంద్‌ కీ దూరీ కా, అందాజా లగానా ముష్కిల్‌ థా 
( నా భారతావని సున్నాను కనుగొన్నాకే ప్రపంచానికి లెక్కించడం తెలిసింది 
సున్నా భాషను ఈ దేశమే లోకానికి తొట్టతొలుత నేర్పించింది 
భారతదేశం దశాంశ జ్ఞానమే ఇవ్వకపోతే చంద్రుని మీదికి వెళ్లడం క ష్టమయ్యేది 
భూమి, చంద్రుల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమయ్యేది) 
సభ్యతా జహాఁ పహెలే ఆయీ, జన్మీ జహాఁ పహెలే కలా 
మేరా భారత్‌ వో భారత్‌ హై, జిస్‌కే పీఛే సంసార్‌ చలా 
సంసార్‌ చలా ఔర్‌ ఆగే బఢా, ఆగే బఢా ఔర్‌ బఢ్‌తా హీ గయా 
భగ్‌వాన్‌ కరే యే ఔర్‌ బఢే, బఢ్‌తా హీ రహే ఔర్‌ ఫూలే ఫలే 
(ఎక్కడ సభ్యత ముందుగా వచ్చిందో, కళాత్మకత ఎక్కడ తొలుత జనించిందో 
ఆ నా భరతభూమి వెనుక యావత్‌ ప్రపంచమే నడిచింది. అడుగు ముందుకు వేస్తూ ఇంకా ఎంతో పురోగమించింది. దైవం ఇలా ఇంకా ముందుకు తీసుకుపోనీ, వృద్ధికి తేనీ, మరెంతో వికసింపచేయనీ)
హై ప్రీత్‌ జహాఁ కీ రీత్‌ సదా, మై గీత్‌ వహాఁ కే గాతా హూఁ 
భారత్‌ కా రహెనే వాలా హూఁ, భారత్‌ కీ బాత్‌ సునాతా హూఁ 
( ఎక్కడైతే ప్రేమ ఎప్పుడూ ఒక రీతిగా ఉందో, అక్కడి గీతాన్ని నేను గానం 
చే స్తాను, భారత వాసిని నేను, భారతీయ విషయాల్ని వినిపిస్తాను) 
కాలే గోరే కా భేద్‌ నహీఁ హర్‌ దిల్‌ సే హమారా నాతా హై 
కుఛ్‌ ఔర్‌ న ఆతా హో హమ్‌ కో, హమే ప్యార్‌ నిభానా ఆతా హై 
జిసే మాన్‌ చుకీ సారీ దునియా, మై బాత్‌ వహీ దోహ్‌రాతా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(నలుపు తెలుపు భేద భావం లేదు, ప్రతి హృదయంతోనూ మా అనుబంధం ఉంది. మాకు మరేదో రాకపోయినా, ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం బాగా తెలుసు. దేన్ని లోకమంతా ఒప్పుకుందో, ఆ మాటే నేను మళ్లీ చెబుతాను) 
భారతీయులు అమితంగా ఆరాధించే శ్రీరాముడు, శ్రీకృష్ణుల శరీర వర్ణం నలుపు రంగే. ఇలాంటి వారికి నలుపు తక్కువ తెలుపు ఎక్కువ అనే వర్ణభేదం ఎలా ఉంటుంది? భారతీయులకు ప్రేమను పంచడం, ప్రేమల్ని సమున్నతంగా నిలబెట్డడమే పరమ లక్ష్యంగా ఉంటుంది. ఇది వాస్తవమని ఏవో ఒకటి రెండు దేశాలు కాదు, మొత్తం ప్రపంచమే ఆమోదించింది. నిజానికి, లోకానికి ఆ మార్గాన్ని ఆ గమనంలోని రహస్యాల్ని తెలియజెప్పడమే ధర్మంగా భారతదేశం సాగిపోతోంది. .
జీతే హో కిసీ నే దేశ్‌ తో క్యా, హమ్‌నే తో దిలోంకో జీతా హై 
జహాఁ రామ్‌ అభీ తక్‌ హై నర్‌ మే, నారీ మే అభీ తక్‌ సీతా హై 
ఇత్‌నే పావన్‌ హై లోగ్‌ యహాఁ మై నిత్‌ నిత్‌ శీశ్‌ ఝుక్‌తా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(ఎవరైనా దేశాల్ని గెలిచారేమో గానీ, మేమైతే హృదయాల్ని గెలిచేశాం 
ఇక్కడి ప్రతి పురుషుడిలోనూ రాముడున్నాడు, ప్రతి స్త్రీ లోనూ సీత ఉంది 
ప్రజలెంత పవిత్రంగానో ఉన్నారో ఇక్కడ.. వారి ముందు అనునిత్యం శిరస్సు వంచుతాను. ) 
యుద్ధాలు చేసి, ఎవరైనా దేశాలు గెలుచుకోవచ్చేమో గానీ, ఏ యుధ్ధాలు చేసి హృదయాల్ని గెలుస్తారు? ప్రేమ బావుటా ఎగరేయాలి గానీ, రక్తపాతంతో ఎవరైనా గుండెలకు చేరువ కాగలరా? భౌతిక సంపద మీద వ్యామోహం పోతే గానీ, ప్రేమ సంపదను సమకూర్చుకోలేరు. అందుకే ప్రేమ రాజ్యాల్ని గెలవడం ద్వారా భారతీయులు రారాజులయ్యారు. పరిణామ క్రమంలో చోటు చేసుకునే ఉత్తాన పతనాలు ఎలాగూ ఉంటాయి కానీ అనాదిగా వస్తున్న మానవీయ విలువలు ఇతరుల కన్నా మిన్నగా ఈ దేశంలో కొనసాగుతున్నాయి. వాటి ముందు ఎవరైనా సవినయంగా తలవంచాల్సిందే....
ఇత్‌నీ మమ్‌తా నదియా కో భీ, జహాఁ మాతా కహెకే బులాతే హైఁ 
ఇత్‌నా ఆదర్‌ ఇన్సాన్‌ తో క్యా పత్తర్‌ భీ పూజే జాతే హైఁ 
ఇస్‌ ధర్‌తీ పే మైనే జనమ్‌ లియా, యే సోచ్‌ కే మై ఇత్‌రాతా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(నదులంటే ఎంత మమకారమో ఇక్కడ ప్రతి నదినీ తల్లీ అని పిలుస్తారు 
మనుషులకు ఎనలేని ఆదరణే కాదు, ఇక్కడ రాళ్లుకూడా పూజింపబడతాయి 
ఈ నేల మీద జన్మించాను కదా అన్న భావనతో నేనెంతో గర్వపడతాను) 
ప్రతి అణువునా భారతీయులు ఒక దివ్యత్వాన్ని చూస్తారు. దైవంగా ఆరాధిస్తారు. అందుకే ప్రవాహాల్ని ఏదో నదిలే అనుకోరు. ప్రతి నదినీ ఇక్కడ ఒక దేవతగా ఆరాధిస్తారు. ఇదేమిటి మీ దేశంలో రాళ్లను పూజిస్తారు? అంటే మనుషుల్నే కాదు అంతే సమానంగా రాళ్లనూ పూజిస్తామని ఎదురు సమాధానం చెబుతారు. నిజానికి, ఏ పంచభూతాత్మక శక్తి ప్రాణికోటినంతా ఆవరించి ఉందో, ఆ శక్తే సమస్త నిశ్చల ప్రకృతిలోనూ ఉంది కదా! అందుకే చరాచర జగత్తునంతటినీ సమదృష్టితో చూసే సమున్నత సంస్కృతి ఈ దేశీయులకు అబ్బింది. ఏముందిలే అనుకునే వారికి ఏమీ ఉండదు కానీ, అర్థం చేసుకునే వారికి ఈ సంస్కృతి ఆకాశమంత ఎత్తున కనిపిస్తుంది. 

Monday, August 8, 2016

ఏ మేరే వతన్‌ కే లోగోఁ .....! - ye Mere watan ki logo

అమర వీరుల్ని... మరిచిపోకండి...!  
 

1963లో భారత చైనా యుద్ధం ముగిసిన తరువాత, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే ఒక కార్యక్రమం, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ హాజరయ్యారు. అమర వీరుల స్మృత్యర్థం ప్రముఖ కవి, ప్రదీప్‌ రాసిన ‘ఏ మేరే వతన్‌ కే లోగోఁ గీతాన్ని సి. రామచంద్ర స్వరపరిస్తే, లతా మంగేష్కర్‌ ఆ వేదిక మీద ఎంతో రసార్థ్రంగా పాడారు. ఆ గీతం విని భావోద్వేగానికి లోనైన నెహ్రూ వేదిక మీదే కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రైవేట్‌ గీతాన్ని ఐదు దశాబ్దాలుగా వింటూనే ఉన్నా, విన్న ప్రతిసారీ దేశ ప్రజల హృదయాలు గగుర్పాటుకు లోనవుతూనే ఉన్నాయి. అమర వీరుల త్యాగాల్ని తలుచుకుని భారతీయుల గుండెలు తీవ్రమైన ఉద్విగ్నతతో ఊగిపోతూనే ఉన్నాయి..... 


ఏ మేరే వతన్‌ కే లోగోఁ .....! తుమ్‌ ఖూబ్‌ లగాలో నారా 
యే శుభ్‌దిన్‌ హై హమ్‌ సబ్‌కా, లహెరాలో తిరంగా ప్యారా 
పర్‌ మత్‌ భూలో సీమా పర్‌, వీరో నే హై ప్రాణ్‌ గవాయే 
కుఛ్‌ యాద్‌ ఉన్హే భీ కర్‌లో, జో లౌట్‌ కే ఘర్‌ నా ఆయే 

(ఓ నా దేశ ప్రజలారా! మీరు ఎలుగెత్తి నినాదాలు చేయండి 
మనందరికీ ఇదో శుభదినం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి 
కానీ, సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల్ని ఎప్పుడూ మరిచిపోకండి 
ఎన్నడూ ఇంటికి తిరిగి రాకుండా పోయిన ఆ వీరుల్ని జ్ఞాపకం చేసుకోండి) 
పల్లవి:
ఏ మేరే వతన్‌ కే లోగోఁ జరా ఆంఖ్‌ మే భర్‌లో పానీ 
జో శహీద్‌ హుయేఁ హైఁ ఉన్‌ కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
తుమ్‌ భూల్‌ న జావో ఉన్‌ కో, ఇస్‌ లియే సునో యే కహానీ 
జో శహీద్‌ హుయే హై ఉన్‌కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(ఓ నా దేశ ప్రజలారా..! కళ్లల్లో కాసిన్ని అశ్రువుల్ని నింపుకోండి 
అమరులైన వారి ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి 
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథ వినండి ) 
జబ్‌ ఘాయల్‌ హువా హిమాలయ్‌, ఖత్‌రే మే పడీ ఆజాదీ 
జబ్‌ తక్‌ థీ సాఁస్‌ లడే వో, ఫిర్‌ అప్‌నీ లాశ్‌ బిఛా దీ 
సంగీన్‌ పే భర్‌ కర్‌ మాథా, సోగయే అమర్‌ బలిదానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌ కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 

/అమరులైన/ 
(హిమాలయాలు గాయమైనప్పుడు, స్వాతంత్య్రం ప్రమాదంలో పడినప్పుడు 
ఊపిరి ఉన్నంతవరకు పోరాడి, చివరికి తమ శవాల్ని పరిచేశారు 
తుపాకీ అంచు మీద నుదురు ఆనించి, అమర వీరులు శాశ్వతంగా నిదురోయారు) /అమరులైన/ 
జబ్‌ దేశ్‌ మే థీ దీవాలీ, వో ఖేల్‌ రహే థే హోలీ 
జబ్‌ హమ్‌ బైఠే తే ఘరోఁ మే, వో ఝేల్‌ రహే థే గోలీ 
థే ధన్య్‌ జవాన్‌ వో అప్‌నీ, థీ ధన్య్‌ వో ఉన్‌కీ జవానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌ఖీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(దేశంలో దీపావళి జరగుతున్న వేళ, జనమంతా హోళీ ఆడుతున్నప్పుడు 
మనమంతా ఇళ్లల్లో కూర్చున్నప్పుడు, వాళ్లు తూటాలకు ఎదురొడ్డుతూ ఉండిపోయారు 
ఎంతటి ధన్యులో ఆ సైనికులు, వారి యువశక్తి ఎంత సార్దకమైనదో) /అమరులైన/ 
కోయీ సిక్‌, కోయి జాట్‌, మరాఠా.... కోయీ గుర్కా, కోయీ మద్‌రాసీ 
సర్‌హద్‌ పర్‌ మర్‌నే వాలా.... హర్‌ వీర్‌ థా భారత్‌ వాసీ 
జో ఖూన్‌ గిరా పర్వత్‌ పర్‌, వో ఖూన్‌ థా హిందుస్తానీ 
జో శహీద్‌ హుయే ఉన్‌కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(ఒకరు సిక్కు, ఒకరు జాట్‌, ఒకరు మరాటీ ఒకరు గూర్ఖా, ఒక మదరాసీ 
ఎవరైతేనేమిటి? సరిహద్దులో మరణించే ప్రతి వీరుడూ భారత వాసి 
పర్వతాల మీద పడిన రక్తం ఎవరిదైతేనేమిటి? ఆ రక్తం హిందుస్తానీది) 
/అమరులైన /- 
థీ ఖూన్‌ సే లథ్‌పథ్‌ కాయా, ఫిర్‌ భీ బందూక్‌ ఉఠాకే 
దస్‌ దస్‌ కో ఏక్‌ ఏనే మారా, ఫిర్‌ గిర్‌ గయే హోశ్‌ గవా కే 
జబ్‌ అంత్‌ సమయ్‌ ఆయా తో, కహ్‌గయే కె అబ్‌ మర్‌తే హై 
ఖుశ్‌ రహ్‌నా దేశ్‌ కే ప్యారో, అబ్‌ హమ్‌ తో సఫర్‌ కర్‌తే హైఁ 
(రక్తంలో దొర్లుతూనే ఉన్నారు, అయినా తుపాకీ లేవనెత్తి 
ఒక్కొక్కరు పది-పది మందిని అంతమొందించి, చివరికి స్పృహ తప్పి నేలవాలిపోయారు 
అంతిమ ఘడియలు వచ్చేశాక, తమ మరణాన్ని గురించి చె బుతూ 
సంతోషంగా ఉండండి ఓ నా దేశపు బిడ్డలారా! ఇక మేము వెళ్లిపోతున్నామంటూ సాగిపోయారు.)/ అమరులైన/ 
క్యా లోగ్‌ థే వో దీవానే... క్యా లోగ్‌ థే వో అభిమానీ 
జో శహీద్‌ హుయే హై ఉన్‌ కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
తుమ్‌ భూల్‌ న జావో ఉన్‌కో, ఇస్‌ లియే యే హై కహానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
జయ హింద్‌....జయ హింద్‌, జయ హింద్‌ కీ సేనా- 2 
జయ హింద్‌... జయహింద్‌... జయ్‌ హింద్‌... జయ హింద్‌... జయహింద్‌ 
(ఏమిటా పిచ్చి వారికి! ఎంతటి దేశ ప్రేమికులు వారు! 
అమరవీరుల ఆ ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోండి 
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథంతా వినండి /అమరులైన/ 

స్వాతంత్య్రం రాగానే సరిపోదు కదా! ఈ స్వతంత్ర దేశాన్ని కుటిలత్వంతో కుయుక్తులతో కూలదోయాలని చూసే శత్రుదేశాల నుంచి దాన్ని అనుక్షణం కాపాడుకోవడమూ అంతే ముఖ్యం కదా! అలా కాపాడుతున్నది అన్నింటికీ సిద్ధపడి, రేయింబవళ్లు సరిహద్దుల్లో గస్తీ కాసే సైనిక వీరులే! ఆ గస్తీలోనూ ఇప్పటికీ ఎన్నెన్నో ప్రాణాలు అహుతి అవుతూనే ఉన్నాయి. అనంతంగా సాగిపోతున్న అమర వీరుల ప్రాణత్యాగాలను అనుక్షణం గుర్తు చేసుకోవడం తప్ప వారి ఆత్మలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆ అమరవీరులను అనునిత్యం గుర్తుచేయడం ద్వారా ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా ఒక అద్భుతమైన భూమిక నిర్వహిస్తోంది. ఆనాటి అమర వీరుల శ్రద్దాంజలి సభలో మాట్లాడుతూ నెహ్రూ ‘ఈ పాట విని స్పూర్తి పొందని వాడు అసలు భారతీయుడే కాదు’ అన్నారు. దేశ రక్షణలో మనమూ ఒక భాగం కావడానికి కంకణబద్ధులమవడం తప్ప భారతీయుడిగా మన ముందుండే మరో కర్తవ్యం ఏముంది!
                                                                                                                                                 ... బమ్మెర